NGKL: కుమ్మెరలో జరిగిన చిన్నారి మౌనిక మృతి ఘటనపై విచారణకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మంగళవారం రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రామానికి చేరుకుని, ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల నుంచి కమిషన్ నివేదిక కోరింది.