RR: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారుల ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుంచి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయలన్నారు.