SRD: ఇంటి వద్దకే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తలంబ్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. www.tgslogistics.co.in, ఆర్థిక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ల వద్ద రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.