GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అలంపూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ పేర్కొన్నారు. ఎర్రవల్లి మండలం యుక్తాపూర్లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యుత్, సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు.