KMM: సత్తుపల్లిలో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులతో 5K రన్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ ఛైర్పర్సన్ రిహానా కమల పాషా కమిషనర్ నరసింహ ఈ పరుగును ప్రారంభించారు. వార్డ్ కౌన్సిలర్లు, అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.