WGL: వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు ఛైర్మన్ హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ స్పష్టం చేశారు.