NRPT: ధన్వాడ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు సహకరించాలని, సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. గురువారం ధన్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.