MNCL: బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు సమీపంలో రోడ్డు భద్రతపై మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.