PDPL: మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జమఖర్చులు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. సభ్యులు, రైతులు, అధికారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.