మంచిర్యాల జిల్లాలోని దివ్యాంగులకు ఏప్రిల్ నెలలో సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు DRDO కిషన్ సోమవారం తెలిపారు. గతంలో మార్చి 26 వరకు నమోదు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత పత్రాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు కావాలని సూచించారు. సంబంధిత తేదీలలో క్యాంపునకు హాజరు అగుటకు సంబంధిత అభ్యర్థి సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించనున్నట్లు తెలిపారు.