HYD: హిమాయత్ నగర్లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కోరుతూ జయంతి గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ దీక్షకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్యదర్శి విజయ్ కుమార్ మద్దతు తెలిపారు. బీసీ జనగణన చేపట్టి, జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ కోటా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.