అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిడిపివోలు, సూపర్వైజర్లతో జరిగిన ఈ భేటీలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పోషకాహార పంపిణీపై దిశానిర్దేశం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.