KMR: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 113 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, జడ్పీ సీఈవో చందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.