GDWL: పిల్లిగుండ్ల గ్రామంలోని నిరుపేదలకు కనీస సౌకర్యాలు లేని పూరి గుడిసెలే దిక్కయ్యాయని సామాజిక కార్యకర్త డాక్టర్ ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేస్తూ, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలం రాకముందే స్పందించి పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.