MNCL: మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సోమవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండగా.. తెలుపు పూల షర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.