KNR: కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.