MDK: రామాయంపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లి, అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. గతంలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని, అప్పుడే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు స్పష్టం చేశారు.