SDPT: రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఈనెల 22 నుంచి తలపెట్టిన సమ్మెలో అధికారులు, కార్మికులు భాగస్వామ్యం కావాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ ఎంపీ రెడ్డి పిలుపునిచ్చారు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు అందరూ కలిసి రావాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యాజమాన్య బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడేది లేదని పేర్కొన్నారు.