KNR: కరీంనగర్ పట్టణం ఆరేపల్లి గ్రామ శివారులోని పత్తి చేనులో సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతుడు తెల్లని గడ్డంతో, తెల్లని బనియన్, ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 8712670764 నంబరును సంప్రదించాలని కోరారు.