KMM: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రభుత్వ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మామిళ్ళగూడెం ప్రాంతంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. నగర పాలనను బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను ఆయన స్వయంగా సమీక్షించారు. పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని, పౌర సేవలను మెరుగుపరచాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.