NZB: బాసర గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జన్నెపల్లికి చెందిన కోట గంగామణి(26) భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె మానసికంగా కుంగిపోయి బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. మంగళవారం ఉదయం బయటకు వెళ్లిన ఆమె బుధవారం సాయంత్రం నదిలో దూకింది. నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.