SRPT: అనంతగిరి మండలం రంగయ్యగూడెం గ్రామంలో పశువుల దొంగతనాలు పెరిగిపోతుండటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం రాత్రి ఎర్రపు హనుమంతయ్య అనే రైతు ఇంటి ముందు కట్టేసిన దూడను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీనిపై బాధితుడు శుక్రవారం అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.