కడప జిల్లాలోని మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, చీటింగ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచించారు.