MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే సెంటర్ వద్ద CPM పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CPM జిల్లా కమిటీ సభ్యులు పాపారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు రూ.60 పెంచడం ద్వారా నిరుపేదల పై భారం మోపుతోందని అన్నారు. ధరలు వెంటనే తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.