KNR: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూరులో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. రోడ్లపై ఉన్న చెత్తను తొలగించిన అనంతరం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్లే మట్టి రోడ్డు నిర్మాణానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు.