WGL: నగరంలోని ESI ను నిన్న సాయంత్రం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్పేషెంట్ విభాగం, ఇన్పేషెంట్ వార్డులు, ల్యాబ్ సేవలు, మందుల నిల్వలు, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ… ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.