SRPT: నాగారం మండల కేంద్రంలో ప్రగతి నగర్ స్టేజ్ వద్ద ఆదివారం ఆగి ఉన్న హార్వెస్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అనాజిపురంకు చెందిన కొల్లు యాదయ్య ద్విచక్ర వాహనంపై తిరుమలగిరి నుండి సూర్యాపేట వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై చిరంజీవి ఏరియా ఆసుపత్రిలోనే ఫిర్యాదు స్వీకరించారు.