BDK: అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అతి ముఖ్యమైనవని భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటించాలని తెలిపారు.