SRD: సంగారెడ్డి మండలం కల్పగూరు, అంగడిపేట, మల్కాపూర్ గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. వారం రోజుల పాటు వాలంటీర్లు గ్రామాల్లో పరిశుభ్రత, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.