NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా గురువారం నిర్వహించిన ప్రధమ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం చరిత్ర పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 6358 మంది విద్యార్థులకు గాను 6138 మంది పరీక్ష రాశారని 220 మంది గైర్హాజరయ్యారని వారు వెల్లడించారు.