GDWL: జనాభా గణనలో భాగంగా చేపట్టే ఇళ్ల గణనను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతీ హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.