MHBD: బయ్యారం మండలం వెంకట్రాపూరం గ్రామ పంచాయతీ శివారులోని చోక్లాతండాలో శనివారం అర్ధరాత్రి వీధి కుక్కలు సైర్వ విహారం చేశాయి. కుక్కల మంద నలుగురిపై దాడి చేయగా, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆదివారం బయ్యారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. ఘటనతో తండా వాసుల్లో భయం నెలకొంది.