SRD: బీరంగూడ ప్రభుత్వ ఐటీఐలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ DYFI, SFI, CITU ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్, సీఐ నరేష్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో సీఐటీయూ నేత రాజయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.