SRD: జిన్నారం మున్సిపాలిటీ రాళ్లకత్వ గ్రామంలో సర్వే నంబర్ 286లోని అసైన్డ్ భూమి నుంచి కొందరు అక్రమంగా మొరం తరలిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే తవ్వకాలు నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.