MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులు పంటలను పరిశీలించి సలహాలు తీసుకోవాలని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2 రోజులుగా మండలంలో అకాల వర్షాలు పడుతున్నాయని తెలిపారు. అకాల వర్షాలకు పంటలకు వివిధ తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నారు. రైతులు వేసిన పంటలను క్షుణ్ణంగా పరిశీలించి తెగుళ్లు సోకితే నివారణకు సలహాలు తీసుకోవాలన్నారు.