JN: ఈ- వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలంలోని శామీర్పేట్ గ్రామ పరిధిలో గల DRC కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని ఆయన తెలిపారు.