HYD శివారులో భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల పనులను డెడ్ లైన్ వరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని వేగవంతం చేసి అవసరమైన అనుమతులు, ఇతర అవసరాలను వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలకు త్వరగా సేవలు అందేలా పనులను సమయానికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.