MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో నరేందర్ రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తదితరులు ఉన్నారు.