JGL: జనగణన- 2027 తొలి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి సూచించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన సమీక్షలో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మ్యాప్ తయారీపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు శిక్షణల చేపట్టనున్నట్లు తెలిపారు.