హన్మకొండలోని ములుగు రోడ్డు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI) ప్రాంగణంలో ఏప్రిల్ 2వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ చందర్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో నిర్ణీత సమయంలోగా వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.