HNK: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డీఆర్ఓకు సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కోరారు. 2వ పీఆర్సీలో నిర్ణయించి అమలు చేయాలని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.