PDPL: జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాల్టితో విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. రెవెన్యూ, పోలీస్, తపాలా, వైద్య, విద్యాశాఖ, విద్యుత్ మరియు టెలిఫోన్ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.