MNCL: రైతులు పొలాల్లో వేసిన పంటను బట్టి యూరియాను వేయాల్సి ఉంటుందని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని చాలా గ్రామాలలో రైతులు వేసిన పంటలు ఎదుగుదశలో ఉన్నాయన్నారు. ఆయా పంటలకు అవసరమైన ఎరువులను కూడా రైతులకు అధికారులు అందజేస్తున్నారని తెలిపారు. ఆ పంటలకు ఎరువులను వేసే ముందు వ్యవసాయ అధికారుల సలహాలను, సూచనలను పాటించాలన్నారు.