JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి మంగళవారం మొత్తం రూ.2,46,462 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ .1,34,798, ప్రసాదాల ద్వారా రూ .95,900, అన్నదానం ద్వారా రూ.15,764 వసూలైనట్లు ఆయన వెల్లడించారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.