JGL: ధర్మపురి మండలం రాయపట్నంలో గంజాయి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయపట్నానికి చెందిన విష్ణు అనే వ్యక్తి గంజాయి కొనుగోలు కోసం లక్షెట్టిపేటకు చెందిన ప్రదీప్ను సంప్రదించాడు. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుంచి 100 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.