KNR: రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి ప్రారంభమై రెండు నెలలైన సొమ్ము జమ చేయలేదని విమర్శించారు. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులు వేస్తామని ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలో 67 లక్షలకుపైగా రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.