PDPL: గోదావరిఖనిలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏఐటీయూసీ, NFAW నాయకులు సంఘీభావం తెలిపారు. వన్ టౌన్ సీఐ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని ఏఐటీయూసీ నేత అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు మద్దతు ఉంటుందన్నారు.