SKLM: గగంగువారి సిగడాం మండలంలో మడ్డువలస ప్రాజెక్ట్ కాలువ పనుల పురోగతిని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు సోమవారం పరిశీలించారు. దేవరవలస వద్ద చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.26 కోట్ల 90 లక్షల నిధులతో ఫేజ్-2 పనులు జరుగుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్కు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.