GDWL: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదైన అలంపూర్ శ్రీ జోగుళాంబ దేవి ఆలయంలో లోక కల్యాణం, భక్తుల యోగక్షేమం కోసం అర్చకులు, వేద పండితులు నిత్యం వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో త్రిశతి, ఖడ్గమాల పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ప్రతినిధి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.