AP: టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాకు అన్యాయం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలను తరిమికొట్టాలి. మూలపేట, భోగాపురం పోర్టుల పేరుతో మోసం చేస్తున్నారు. రెండేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పుచేశారు. అమరావతికే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో లేదా?’ అని ప్రశ్నించారు.